ఈడీ అధికారాలేంటి? ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకంత పవర్ ఫుల్?


What is Enforcement Directorate (ED)?

ఈ.డీ అధికారులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ, ఢిల్లీ రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ కొనసాగిస్తోంది.

ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకంత పవర్ ఫుల్..! అసలు ఈడీ అధికారాలు ఏంటి? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు టీ బీసీ జేఏసీ లీగల్ సెల్ అధ్యక్షుడు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ఇలా వివరించారు.

సాధారణంగా రాజకీయ నాయకులు 'ఏం చేస్తావో చేసుకో', 'ఏ కేసులకు భయపడేది లేదు' అంటుంటారు.. అలంటి వారు కూడా ఈడీ అనగానే కాస్త వెనుకడుగు వేయడం ఖాయం. ఈడీ పేరు చెప్పగానే ప్రముఖ వ్యక్తులు అయినప్పటికీ వణికిపోతుంటారు.

సిబిఐ, ఐటీ ఇతర సంష్తల కంటే ఈడీ ఎందుకంత పవర్ ఫుల్..! అసలు ఈడీ అధికారాలు ఏంటి? ఈడీ నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు న్యాయవాది హరి అశోక్ కుమార్ ఇలా వివరించారు.

ఈడీ అంటే "ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్" (Enforcement Directorate) ఇది ప్రధానంగా రెండు చట్టాలపై పని చేస్తుంది. ఒకటి ఫెమా, మరొకటి పి ఎం ఎల్ ఏ.ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజి మనజిమెంట్ యాక్ట్ -1999. ఇది సివిల్ చట్టం.

ఫెమా లో ఫారిన్ ఎక్సేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు.

పి ఎం ఎల్ ఏ అంటే ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ -2002. ఇది క్రిమినల్ చట్టం. ఇందులో భాగంగా చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించి చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించినా ఆస్తుల్ని ప్రభుత్వానికి అటాచ్ చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ.

పీఎం ఎల్ ఏ ప్రకారం ఈడీకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. 1. కోర్ట్ పర్మిషన్ లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు. దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం లేదు. కోర్ట్ పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా దేశం లో ఎవరి ఇంట్లో, ఆఫీసులో నైనా రైడ్స్ చేయవచ్చు.

సిబిఐ గానీ, ఇతర పోలీసు డిపార్ట్మెంట్ లు గానీ విచారణలో ఉన్నవారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆ స్టేట్మెంట్ లను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు.

అంటే.. నిందితులు చెప్పిన స్టేట్ మెంట్ కు మళ్ళీ పోలీసులు సాక్ష్యాలు చూపించాలి. ఈడీకి ఆలా కాదు. పి.ఎం.ఎల్.ఏ. సెక్షన్ 50 అండర్ 2 ప్రకారం ఈడీ ఎవరి స్టేట్మెంట్ అయినా రికార్డు చేసిందనుకోండి, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ.. ఆ వ్యక్తి తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చాడనుకోండి మళ్ళీ అతడి మీద చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు.

నెం-3 సాధారణంగా చట్టం ఏం చెబుతోంది? నేరం రుజువు కానంతవరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు. అంటే ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఒకరిని హత్య చేసాడు అని కేసు నమోదు చేస్తే.. పోలీసులు, ప్రాసిక్యూషన్ అది ఏ నే చంపాడు అని సాక్ష్యాలన్నీ కోర్ట్ ముందు పెట్టేవరకు ఏ అమాయకుడే.

ఆ సాక్ష్యాలు సంపాదించటానికి పోలీసులకు నానా ఇబ్బందులు ఉంటాయి. కానీ.. ఈడీలో అలా కాదు. రివర్స్ లో ఉంటుంది. మీరు నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషే!

ఉదాహరణకు ఒక వ్యక్తి అక్రమంగా 10 కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయనుకోండి ఆ వ్యక్తి నా దగ్గర 5 కోట్లే ఉన్నాయి అవి కూడా సక్రమంగా సంపాదించాను అని తానే నిరూపించుకోవాలి. లేకపోతే తప్పు చేసినట్లే లెక్క. ఇక్కడ తాను నిర్దోషి అని నిరూపించుకునే బాధ్యత, బరువు ఆ వ్యక్తి పైనే ఉంటుంది.

ఈడీ అధికారులపై అనవసర టెన్షన్ ఉండదు. ఈడీ మోపే ఆరోపణలకు నిర్దోషి అని నిరూపించుకోవడానికి తల ప్రాణం తోకలోకి వస్తుంది.

అందుకే ఈడీ కేసులంటే నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం భయపడుతుంటారు. ఈ సూపర్ పవర్స్ వల్లే ఈడీ కేసులంటే భయపడిపోతుంటారు. అందుకే.. ఈ మధ్య కాలంలో సిబిఐ కంటే ఈడీ పైనే నజర్ ఎక్కువైందనే విషయం చర్చనీయాంశంగా మారింది .

- టీబీసీ జేఏసీ లీగల్ సెల్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్