రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు, కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు
చేదు నిజం ఏమంటే, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం, టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. ఆలోచించండి!
రాజకీయ నేతలు కావాలనుకొనేవాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే, దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.
25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు. కానీ, ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇవ్వాలి?
India Politics and Political Leaders
నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ, భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?
రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు. కాని, మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు. రైతు తినేది దొంగ సొమ్మా? నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం?
విద్యలో రాజకీయం 100% రాజకీయంలో విద్య ??% ఆహా ఎంత గొప్ప విధానం! ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది! దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు!
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి - వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి! అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.
₹399 కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి ₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?
ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా? అందరూ ఆలోచించాలి!
దయచేసి మన దేశంలోని ఇలాంటి వ్యవస్థ గురించి అందరితో చర్చించి ఆలోచింపచేద్దాం! మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఓటు, అది వేసేముందు ఒకటికి పది సార్లు ఆలోచిద్దాం. కుల, మత, ప్రాంత, సానుభూతి, దనం, మద్యం లాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి వైరుధ్యాలు లేకుండా మంచి నాయకులను ఎన్నుకుందాం. మన బావి తరాలకు మంచి భవిష్యత్తును అందిద్దాం.