NEST - 2025 - నెస్ట్ - నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025


NEST Exam 2025 - National Entrance Screening Test Details

శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? సైన్స్ పరిశోధనే కెరీర్ గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారా? ఇంజనీరింగ్, మెడిసిన్ కు భిన్నంగా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చదవాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. జాతీయ స్థాయిలో నిర్వహించే నెస్ట్ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం నెస్ట్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..

నెస్ట్ (నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్)

జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా 2025 - 30 విద్యా సంవత్సరంలో బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పీజీ కోర్సు - ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (ఐదేండ్లు) ప్రవేశాలు కల్పిస్తారు.

భువనేశ్వర్ లోని నైసర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్), యూనివర్సిటీ అఫ్ ముంబై లోని డిపార్ట్మెంట్ అఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)లో ప్రవేశాలు కల్పిస్తారు. నైసర్ హోమిబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ (హెచ్.బీ.ఎన్.ఐ) ఆఫ్ క్యాంపస్ సెంటర్.

అర్హతలు:

ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలనుండి 2023, 2024 సంవత్సరాల్లో ఇంటర్ (సైన్స్ గ్రూప్)లో కనీసం 60 శాతం మార్కులతో ఉతీర్ణులై ఉండాలి లేదా 2025లో ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోట్:

ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు 55 శాతం మార్కులతో ఉతీర్ణత సాధిస్తే సరిపోతుంది.

వయస్సు:

ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం:

* నైసర్, సీఈబీఎస్ లో ప్రవేశాలు పొందాలంటే నెస్ట్ 2025 పరీక్ష తప్పనిసరిగా రాయాలి.

* ఈ పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

* పరీక్షలో బయాలజీ, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

* ఒక్కో సెక్షనుకు 60 మార్కులు. పరీక్షలో నెగేటివ్ మార్కింగ్ విధానం ఉంది.

* ఒక్కో సెక్షనులో 20 ప్రశంలు ఇస్తారు.

* ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.

* ఈ పరీక్షలో అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.

నోట్:

నాలుగు సెక్షన్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సెక్షన్లను పరిగణనలోకి తీసుకొని రెండు ఇన్స్టిట్యూట్లు మెరిట్ లిస్టును విడివిడిగా తాయారు చేస్తాయి.

* 180 మార్కులకు మెరిట్ లిస్ట్ తాయారు చేస్తారు.

* ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది.

రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు:

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ప్రత్యేకతలు:

* ఈ రెండు సంస్థలు రెసిడెన్షియల్ ఇంస్టిట్యూట్లు.

* ఈ సంస్థల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులతో పాటు విదేశీ శాస్త్రవేత్తలు బోధిస్తారు.

* అధునాతన ప్రయోగశాలలు ఉన్నాయి.

* పూర్తిస్థాయిలో లాబొరేటరీలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

* నైసర్ లో 200, సీఈబీఎస్ లో 57 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు:

- దరఖాస్తు: ఆన్ లైన్ లో - చివరి తేదీ: మే 9 - పరీక్ష తేదీ: జూన్ 22 - పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, వీటితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 140 సెంటర్లు ఉన్నాయి. - వెబ్ సైట్: https://nestexam.in

స్కాలర్షిప్:

ఈ సంస్థల్లో సీటు వచ్చిన విద్యార్థులకు దిశా ప్రోగ్రాం కింద ఐదేండ్లపాటు ఏడాదికి 60,000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే వేసవి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ. 20,000 అదనంగా ఇస్తారు. ఇన్ స్పైర్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ట్రెయినింగ్ స్కూల్లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.