ఒక పేదింటి ముసలి అవ్వ ఇంటికి వెళ్లి భోంచేసి వెళుతూ ఆ అవ్వ చేతిలో ఒక కవర్ ఇచ్చి ఆశ్చర్య పరిచిన జిల్లా కలెక్టర్
Karur District Collector T Anbalagan sharing his meal with a poor woman Rengammal
తమిళనాడు లోని కరూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక చిన్న గుడిసెలాంటి ఇంటిలో 80 సంవత్సరాల ఒక అవ్వ నివసిస్తుండేది. తనని చూసుకోడానికి ఎవరూ లేరు. చుట్టు పక్కలవారు కూడా ఎవరూ ఆదరించేవారు కాదు.
ఆ విషయం ఎలా తెలిసిందో గానీ ఆ జిల్లా కలెక్టర్ గారికి తెలిసింది. ఒకరోజు ఆ కలెక్టర్ గారు ఇంట్లో తన భార్య చేత వంటచేయించుకుని, క్యారియర్ తీసుకుని నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్లి.. లోపలికి రావచ్చా అవ్వ అని అడిగాడు.
ఆ అవ్వకు తను ఎవరో తెలియదు.. ఏం చేయాలో అర్థం కాలేదు.. కూర్చోడానికి కుర్చీ లేదని చెప్పింది.. పరవాలేదు కింద కూర్చుంటానని చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు.
చుట్టు పక్కల వారందరూ బయటికి వచ్చి గమనిస్తున్నారు..
అవ్వా.. ఈ రోజు నీతో కలిసి భోజనం చేస్తాను అన్నాడు.. మా ఇంట్లో తినడానికి కంచాలు లేవు.. అరటి ఆకులోనే తినాలి అని చెప్పింది.. సరే అని కింద కూర్చోని అవ్వతో కలిసి భోజనం చేసాడు.
వెళుతూ అవ్వ చేతికి ఒక కవర్ ఇచ్చాడు..
అవ్వకు అర్థం కాలేదు..
అందులో ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రాలు మరియు వృద్దాప్య ఫించనుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి.
వెళుతూ ఆ కలెక్టర్ గారు అవ్వతో చెప్పాడు... నువ్వు డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ కు వెళ్ళనవసరం లేదు.. డబ్బులు నీ ఇంటికే వచ్చే ఏర్పాటు చేసాను... అన్నాడు!
ఆ అవ్వ కళ్ళ నిండా ఆనందభాష్పాలతో.. ఆ అధికారికి చేతులెత్తి నమస్కరించింది.!
ఇది కదా నిజమైన అర్హులకు సహాయం చేయడం అంటే... అలాంటి అధికారులు ప్రతి జిల్లాకు ఉంటే నిజమైన పేదలు బాగుపడే రోజులు చూడగలం!
ఇది జరిగింది తమిళనాడు రాష్ట్రం లోని కరూర్ జిల్లాలో, ఆ కలెక్టర్ పేరు T Anbalagan. ఆ అవ్వ పేరు Rengammal.
"అధికారులతో భోజనం చేయడం కాకుండా, నిరుపేద కుటుంబాలతో కలిసి భోజనం చేయాలని అనుకున్నాను, ఆ విధంగా గ్రామస్థుల ద్వారా వృద్ధ దంపతులు పడుతున్న అవస్థలు తెలుసుకున్నాను. నేను చేసిన ఈ పని ప్రజల కోసం మేము ఉన్నామనే సంకేతం ఇవ్వటం కోసమే." అని ఆ కలెక్టర్ ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పటం జరిగింది!